మానసిక ఉత్తేజాన్ని భక్తుల్లో ప్రాప్తింపజేసేందుకు యాదాద్రి పంచ నారసింహుల సన్నిధి వివిధ హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఆలయ ప్రాకార మండపంలోని వాయువ్య దిశలో భాగ్యనగరానికి చెందిన దాత ఇంద్రసేనారెడ్డి అద్దాల మండపాన్ని నిర్మిస్తున్నారు.
వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా అద్దాల మండపం - ydadadri bhuvanagiri latest news
యాదాద్రి ఆలయం సుందరంగా నిర్మితమవుతోంది. అందులో భాగంగా అద్దాల మండపాన్ని వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా తీర్చిదిద్దుతున్నారు.
![వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా అద్దాల మండపం mirror house being prepared in yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10766703-591-10766703-1614215215727.jpg)
వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా అద్దాల మండపం
దీనిని సంప్రదాయంగా వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా తీర్చిదిద్దుతున్నారు. టేకు కలపతో మండప ద్వారాన్ని మహావిష్ణువు రూపాలతో సిద్ధం చేశారు. మండపంలో ఆలయ దేవుడి రూపాలు, ఊయల దృశ్యాలు సాదృశ్యమయ్యేలా అద్దాల మండపం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.