తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథలైన చిన్నారులపై చలించిన మంత్రి.. దత్తత తీసుకోనున్న దిల్​రాజు - మంత్రి ఎర్రబెల్లి కోరిక మేరకు పిల్లలను దత్తత తీసుకున్న దిల్​రాజు

తల్లిదండ్రులు లేక అనాథలుగా మారిన చిన్నారుల ఆవేదనపై వచ్చిన వార్తను చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చలించిపోయారు. ఆ పిల్లలను వెంటనే దత్తత తీసుకుకోవాలని నిర్మాత దిల్​రాజును కోరారు. మంత్రి కోరిక మేరకు స్పందించిన ప్రొడ్యూసర్​ ఆ ముగ్గురు పిల్లల బాగోగులు చూసుకుంటానని మాట ఇచ్చారు.

minister errabelli react on a story of  Children who have become orphans in yadadri district atmakur village
అనాథలైన చిన్నారులపై చలించిన మంత్రి.. దత్తత తీసుకోనున్న దిల్​రాజు

By

Published : Aug 1, 2020, 6:12 PM IST

తల్లితండ్రులు లేక అనాథలైన పిల్లలు అనే వార్తను చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫోన్​చేసి జరిగిన దాని గురించి తెలుసుకున్నారు. ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్​రాజును మంత్రి కోరారు. అడిగిన తక్షణమే ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్​రాజు తెలిపారు. దీనికి మంత్రి ఎర్రబెల్లి.. ఆయనను అభినందించారు.

ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య కుటుంబం ఆనందంగా జీవిస్తుండేది. కానీ అనారోగ్యం వల్ల గత సంవత్సరం సత్తయ్య చనిపోవడం.. భార్య అనురాధ, పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్​లతో కూలీ చేసుకుని బతుకీడుస్తోంది. కాగా భర్త చనిపోయిన బాధలో ఆమె కూడా మంచం పట్టి రెండురోజుల క్రితం మృతి చెందింది.

ఊరిలోని గ్రామస్థులు, పెద్ద మనుషులు చందాలు వేసుకుని అనురాధ అంత్యక్రియలు నిర్వహించారు. దీనితో సంవత్సరం క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి చనిపోవడం వల్ల ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఊరి గ్రామస్థులు అందరూ కలిసి వారిని సంరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేయగా.. మంత్రి స్పందించి.. దిల్​రాజును సంప్రదించారు.

ఇదీ చదవండి:'ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుందని నమ్ముతున్నా'

ABOUT THE AUTHOR

...view details