తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరికి చెందిన మహిళ అదృశ్యం - police

బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన మహిళ అదృశ్యమైన ఘటన భువనరిగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భువనగిరికి చెందిన మహిళ అదృశ్యం

By

Published : Apr 20, 2019, 9:16 AM IST

భువనగిరికి చెందిన మహిళ అదృశ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కామునికంత కాలనీకి చెందిన కడారి పద్మ గురువారం అదృశ్యమైంది. హైదరాబాద్ బోడుప్పల్​లోని తన చెల్లెలి ఇంటికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరింది. గురువారం రాత్రి వరకూ బోడుప్పల్ చేరుకోకపోవటం వల్ల కుటుంబ సభ్యులు... బంధువుల ఇళ్లలో వాకబు చేశారు . అయినా పద్మ ఆచూకీ దొరకలేదు. శుక్రవారం భువనగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అంజయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details