యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద స్వామి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని పనులను పరిశీలించారు. గర్భాలయం ఫ్లోరింగ్, స్పటిక లింగ ప్రతిష్ఠ విషయంలో కొన్ని సూచనలు చేశారు. ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడం సంతోషకరమని ఆయన అన్నారు. వేగంగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పనులు 99 శాతం శాస్త్రోక్తంగా జరిగాయని తెలిపారు.
నారసింహుని పుణ్యక్షేత్రం అద్భుతం: మాధవానంద స్వామి - తెలంగాణ వార్తలు
యాదాద్రి నారసింహుని క్షేత్రాన్ని రాంపూర్ పీఠాధిపతి మాధవానంద స్వామి సందర్శించారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మాధవానంద స్వామి, యాదాద్రి ఆలయం
నూతన ప్రధాన ఆలయంలో పున:ప్రతిష్ఠ మహోత్సవం త్వరగా జరగాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. స్వామితో పాటు ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.