యాదాద్రి (yadadri) క్షేత్ర అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. విష్ణు పుష్కరిణి, శివాలయానికి సరికొత్త విద్యుద్దీపాలు అమర్చుతున్నట్లు వైటీడీఏ(ytda) అధికారులు తెలిపారు. శైవాగమ సిద్ధాంతం ప్రకారం శివాలయానికి త్రిశూలం, పాంచరాత్రాగమ సిద్ధాంతం ప్రకారం విష్ణుపుష్కరిణికి శంకు, చక్రం ఆకారాలను ఇత్తడితో అమర్చనున్నారు.
నూతన ప్రధానాలయంలో అమర్చిన విద్యుద్దీపాల మాదిరిగానే ఉన్నప్పటికీ రెండు వైపులా వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అనుమతితో సరికొత్త విద్యుద్దీపాలను యాదాద్రికి తీసుకెళ్తున్నట్లు విద్యుత్శాఖ అధికారులు తెలిపారు.