Yadadri Lakshmi narasimha swamy Adhyayana Utsavam: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో ఈనెల రెండున ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఆరు రోజుల పాటు వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు చివరి రోజు లక్ష్మీనరసింహస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిలిచిన సాధారణ పూజా కార్యక్రమాలను ఆదివారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు ఆలయాధిరాకులు తెలిపారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి అవతార విశిష్టతను ఆలయ అర్చకులు తెలిపారు.
యాదాద్రిలో వైభవంగా ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు - darnmasa utsavalu in Badrachalam
Yadadri Lakshmi narasimha swamy Adhyayana Utsavam: యాదాద్రిలో ఆరు రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. రోజుకోక అవతారంలో దర్శనమిచ్చిన స్వామి వారు... చివరి రోజైన శనివారం లక్ష్మీనరసింహస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక భద్రచలంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
![యాదాద్రిలో వైభవంగా ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు Yadadri Lakshmi narasimha swamy in true form](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17421365-613-17421365-1673084863583.jpg)
నిజరూప అవతారంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి
ఇక భద్రాచలంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని తిరుప్పావై ప్రవచనాలు చదువుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు సరస్వతీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఇవీ చదవండి: