తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 12:18 PM IST

ETV Bharat / state

యాదాద్రీశునికి లక్ష పుష్పార్చన

బహుళ ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారసింహుని సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో కొద్ది మంది అధికారులు, అర్చకుల సమక్షంలో పూజలు చేశారు.

yadadri
యాదాద్రీశునికి లక్ష పుష్పార్చన

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన చేశారు. బహుళ ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన నిర్వహించడం ఆనవాయితీయని అర్చకులు తెలిపారు. లౌక్​డౌన్​ సందర్భంగా కొద్ది మంది సమక్షంలోనే పూజలు చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్​ కిషన్​రావు, అర్చకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details