యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సన్మానం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో 34 ఎంపీటీసీ, 3 ఎంపీపీ, 2 జడ్పీటీసీలు కాంగ్రెస్కు వచ్చాయంటే నైతికంగా హస్తం పార్టీదే విజయమని వెంకట్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీలను తెరాస నాయకులు దొంగల్లా ఎత్తుకెళ్లారని విమర్శించారు. వచ్చే నాలుగేళ్లలో ఆలేరు సెగ్మెంట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తమ కర్తవ్యమని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శపథం చేశారు.
యాదగిరిగుట్టలో కోమటిరెడ్డికి ఘన సన్మానం - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు సన్మానం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో నైతికంగా కాంగ్రెస్దే విజయమని వెంకట్రెడ్డి అన్నారు.

కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
Last Updated : Jun 24, 2019, 12:57 PM IST