తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస క్యాంపు రాజకీయాలు చేస్తోంది: కోమటి రెడ్డి - komati reddy-fire on-Trs camp politics

ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస చేస్తున్న క్యాంపు రాజకీయాలపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 నుంచి 6 స్థానాలను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

తెరాస క్యాంపు రాజకీయాలు చేస్తోంది: కోమటి రెడ్డి

By

Published : May 22, 2019, 11:05 PM IST

నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటానికి తెరాస పార్టీకి చెందిన 6 గురు మంత్రులు ఇక్కడే మకాం వేసి క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి ఆరోపించారు. భువనగిరి లోక్​సభ స్థానంలో కాంగ్రెస్ 80 వేల నుంచి లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 నుంచి 6 ఎంపీ సీట్లను గెలుస్తామని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెరాస క్యాంపు రాజకీయాలు చేస్తోంది: కోమటి రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details