తెలంగాణ

telangana

యాదాద్రిలో కార్తీక లక్ష దీపోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో కార్తీక మాసంను పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరధిలో చేపట్టిన "కార్తీక లక్ష దీపోత్సవం" కార్యక్రమం వైభవంగా జరిగింది.

By

Published : Nov 18, 2019, 7:36 AM IST

Published : Nov 18, 2019, 7:36 AM IST

యాదాద్రిలో కార్తీక లక్ష దీపోత్సవం

కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరధిలో "కార్తిక లక్ష దీపోత్సవం" ఘనంగా నిర్వహించారు. శబరిమల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్​ పాఠశాల మైదానంలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కార్తిక దీపాలు వెలిగించారు.

మహిళలు రక రకాల ఆకృతులలో పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కర హారతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నలంద లక్ష్మీ నరసింహాచార్యులు, కారంపొడి నరసింహాచార్యులు, అయ్యప్ప భక్తులు, స్థానికులు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

యాదాద్రిలో కార్తిక లక్ష దీపోత్సవం

ఇదీ చూడండి : బస్సుల్లేవ్​.. బడికిపోం..!

ABOUT THE AUTHOR

...view details