తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 12:27 PM IST

ETV Bharat / state

యాదాద్రిలో అంతా నిర్మానుష్యం

యాదాద్రిలో జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. పట్ణణ రహదారులు, ప్రధాన కూడళ్లు వెలవెలబోతున్నాయి. భక్తజనం లేక లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

యాదాద్రిలో అంతా నిర్మానుష్యం
యాదాద్రిలో అంతా నిర్మానుష్యం

దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూలో భాగంగా యాదాద్రిలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. భక్తజనం లేక లక్ష్మీనరహింహస్వామి వారి ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు స్వీయనిర్బంధం విధించుకుని ఇళ్లకే పరిమితమైపోవడం వల్ల పట్టణంలోని రహదారులు, ప్రధాన కూడళ్లు బోసిపోతున్నాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

యాదాద్రిలో అంతా నిర్మానుష్యం

ABOUT THE AUTHOR

...view details