యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పాత జాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (55) నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న అతను సోమవారం ఉదయం ఆయాసం ఎక్కువై పరిస్థితి విషమించి మరణించాడు.
కరోనా మృతునికి అంత్యక్రియలు చేసిన ప్రజాప్రతినిధులు - corona deaths in telangana
కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పాతజాల గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్. గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి దహనసంస్కారాలు నిర్వహించారు.
![కరోనా మృతునికి అంత్యక్రియలు చేసిన ప్రజాప్రతినిధులు corona deaths in yadadri, corona deaths in bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:56:47:1621862807-tg-nlg-88-24-covid-death-anthyakriyalu-av-ts10134-24052021181937-2405f-1621860577-779.jpg)
యాదాద్రిలో కరోనా కేసులు, యాదాద్రిలో కరోనా మరణాలు
ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ గంధమయల్ల నర్సింహులు దహన సంస్కారాలకు కావాల్సిన ఖర్చులు కుటుంబానికి అందజేశారు. స్వయంగా వారే పంచాయతీ సిబ్బందితో కలిసి మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు.
- ఇదీ చదవండి:రానున్న మూడురోజులు రాష్ట్రానికి వర్షసూచన