యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి దేవస్థానంలో పనిచేసే చిరుద్యోగులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ మొదలైనపప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షమందికి పైగా నిత్యావసర సరుకులు అందించినట్టు ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులకు తమవంతు సాయంగా నిత్యావసరాలు అందిస్తున్నట్టు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి చిరుద్యోగులకు సరకుల పంపిణీ - నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ సమయంలో సైతం విధులు నిర్వహిస్తున్న యాదాద్రి దేవస్థానం చిరుద్యోగులకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నిత్యావసర సరకులు పంచారు. హైదరాబాద్కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు సరుకులు పంపిణీ చేశారు.
![యాదాద్రి చిరుద్యోగులకు సరకుల పంపిణీ Groceries Distribution In Yadadri Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7631160-502-7631160-1592241352702.jpg)
యాదాద్రి చిరుద్యోగులకు సరుకుల పంపిణీ