తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదగిరిగుట్ట తహసీల్దార్​ దాతృత్వం.. నిరుపేదలకు ఆపన్నహస్తం

యాదగిరి గుట్ట తహసీల్దార్ దాతృత్వం చాటుకున్నారు. సాటి మనిషులెవరూ ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో పేదలు ఒక్కొక్కరికీ రూ. 500, నిత్యావసరాలను అందజేశారు.​

By

Published : Apr 17, 2020, 8:35 PM IST

groceries distributed to the poor by the yadagirigutta  mro in yadadri bhuvanagiri
యాదగిరిగుట్ట తహసీల్దార్​ దాతృత్వం.. నిరుపేదలకు ఆపన్నహస్తం

ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జిల్లా కలెక్టరు ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెవెన్యూశాఖ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు సాయం అందించారు. లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో 573 మందికి 12 కిలోల బియ్యం రూ. 500 చొప్పున తహసీల్దార్​ అశోక్​రెడ్డి అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటింస్తూ భౌతిక దూరం పాటించాలని.. మాస్కులు ధరించాలని లాక్​నిబంధనలను పాటించాలని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details