ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జిల్లా కలెక్టరు ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెవెన్యూశాఖ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు సాయం అందించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో 573 మందికి 12 కిలోల బియ్యం రూ. 500 చొప్పున తహసీల్దార్ అశోక్రెడ్డి అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటింస్తూ భౌతిక దూరం పాటించాలని.. మాస్కులు ధరించాలని లాక్నిబంధనలను పాటించాలని ఆయన పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట తహసీల్దార్ దాతృత్వం.. నిరుపేదలకు ఆపన్నహస్తం
యాదగిరి గుట్ట తహసీల్దార్ దాతృత్వం చాటుకున్నారు. సాటి మనిషులెవరూ ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఉద్దేశంతో పేదలు ఒక్కొక్కరికీ రూ. 500, నిత్యావసరాలను అందజేశారు.
యాదగిరిగుట్ట తహసీల్దార్ దాతృత్వం.. నిరుపేదలకు ఆపన్నహస్తం