తెలంగాణ

telangana

'గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

By

Published : Dec 9, 2019, 4:57 PM IST

యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకుని వెళ్తున్న గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ను బీసీ సంఘాల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హాజీపూర్​ ఘటనలోని నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు.

governer-visited-yadagirigutta
'గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు కనిపించేలా బీసీ సంఘం నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు.

కాన్వాయ్​లో వెళ్తున్న గవర్నర్​కు కనిపించే విధంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. దిశ హత్య కేసులో నిందితులను శిక్షించినట్టుగా వెంటనే మర్రి శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలని కోరారు.

'గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

ఇదీ చూడండి: గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు

ABOUT THE AUTHOR

...view details