తెలంగాణ

telangana

ETV Bharat / state

పీపీఈ కిట్లతో కొవిడ్ మృతదేహానికి అంత్యక్రియలు - యాదాద్రి జిల్లా కొవిడ్ కేసులు

కరోనా.. మానవత్వాన్ని మంట కలుపుతోంది. మనిషి చివరి చూపును కూడా.. నోచుకోకుండా చేస్తోంది. అయిన వారు.. మృతదేహాం దగ్గరకు రావడానికే జంకుతున్నారు. యాదాద్రి జిల్లా గుండాలలో ఇలాంటి పరిస్థితుల్లోనే.. పంచాయతీ సిబ్బంది ధైర్యంగా ముందుకొచ్చి కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.

funeral for covid dead body
funeral for covid dead body

By

Published : May 21, 2021, 11:55 AM IST

కరోనా బాధితులంటే కనీస మానవత్వం చూపించని కాలంలో.. వైరస్​తో మృతి చెందిన ఓ వృద్ధుడికి పంచాయతీ సిబ్బంది ధైర్యంగా ముందుకొచ్చి అంత్యక్రియలు జరిపారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలో ఇది జరిగింది.

అంబాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు చింత పిచ్చయ్య(80) కొవిడ్​ బారిన పడి మృతి చెందాడు. వైరస్ భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది.. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇదీ చదవండి:'ఎంజీఎంలో కరోనా రోగులకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం'

ABOUT THE AUTHOR

...view details