యాదాద్రి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గిరిబాబు ఇటీవల కరోనాతో మృతి చెందారు. బాల్యంలో అతనితో కలిసి చదువుకున్న పదోతరగతి మిత్రులు.. స్నేహితుడి కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ బృందంగా ఏర్పడి.. ఇతర స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా సమకూర్చిన రూ. 1,60,500లను మృతుడి భార్యా పిల్లలకు అందజేశారు.
మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు - అండగా నిలిచిన స్నేహితులు
యాదాద్రి జిల్లా వలిగొండ పట్టణంలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి.. స్నేహితులు అండగా నిలిచారు. నగదు సాయంతో పాటు మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
![మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు financial assistance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:53:42:1624181022-tg-nlg-51-20-friends-help-av-ts10061-20062021143657-2006f-1624180017-939.jpg)
financial assistance
నగదు సాయంతో పాటు స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు.. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:corona deaths: కరోనా కల్లోలం.. మే నెలలో మరణ మృదంగం