తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 6:50 PM IST

ETV Bharat / state

యాదాద్రిలో జాలరులకు చిక్కిన వింత చేప

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని మంగలిగడ్డ వద్ద చేపలు పడుతుండగా జాలరులకు ఓ వింత చేప చిక్కింది. ఈ మత్స్యాన్ని డెవిల్ ఫిష్‌గా పిలుస్తుంటారని, ఇది ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని రైతులు తెలిపారు.

Fishermen found a strange fish
యాదాద్రిలో జాలరులకు దొరికిన వింత చేప

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జాలరులకు వింత చేప చిక్కింది. మంగలిగడ్డకు చెందిన జింకల యాకయ్య అనే రైతు.... తన వ్యవసాయ బావిలో వల వేయగా.. ఈ చేప చిక్కింది. చేపపై నల్లటి మచ్చలు, ముళ్లు ఉన్నాయి. చేపకు కింది బాగంలో నోరు ఉంది. సుమారు అరకేజీపైగానే బరువు ఉంది. ఇలాంటి చేపను గతంలో ఎప్పుడు చూడలేదని యాకయ్య తెలిపారు.

వింత చేప నోటి భాగం
డెవిల్ ఫిష్‌

తన వ్యవసాయ భూమిలోంచి దేవాదుల కాల్వ వెళ్తుందని... అందులోంచి వచ్చి ఉంటుందని చెప్పారు. ఈ వింత చేపను... డెవిల్‌ ఫిష్‌గా పిలుస్తారని యాకయ్య వివరించారు. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని... తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్‌ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని యాకయ్య తెలిపారు.

జాలరులకు దొరికిన చేప

ఇదీ చదవండి: విదేశాల్లో కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తి!

ABOUT THE AUTHOR

...view details