ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురంలో రైతు యమ్మ కృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.