తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2021, 3:46 PM IST

ETV Bharat / state

యాదాద్రిలో భక్తి పారవశ్యం.. తడిసి ముద్దైన భక్తజనం

యాదాద్రి లక్ష్మీనరసింహుని సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండపైన సరైన వసతులు లేకపోవడం వల్ల వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు.

yadadri
yadadri

క్యూలైన్​లో తడుస్తూనే

యాదాద్రి భువనగిరిజిల్లాలోని పలు మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. యాదగిరి గుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, మోటకొండూర్​ మండలాల్లో ఉదయం 9గంటల నుంచి వర్షం పడుతోంది. యాదాద్రీశుని దర్శనానికొచ్చిన భక్తులు జోరువానతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం కావడం వల్ల పిల్లలతో కలిసి దర్శనానికొచ్చిన భక్తుల అవస్థలు వర్ణణాతీతం.

జోరువానలో స్వామిదర్శనానికి

కొండపై సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. కనీసం నిల్చోడానికి కూడా స్థలం లేకపోవడం వల్ల తడుస్తూనే స్వామివారిని దర్శంచుకున్నారు.

తడిసి ముద్దైన యాదాద్రి

స్వామివారిని దర్శించుకున్న జీహెచ్​ఎంసీ మేయర్​

యాదాద్రీశుడి సన్నిధిలో జీహెచ్​ఎంసీ మేయర్​

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు మేయర్​కు స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించగా... ఆలయ ఏఈవో శ్రవణ్​ కుమార్​... లడ్డూప్రసాదం అందించారు. అనంతరం కొండపై నిర్మాణంలో ఉన్న ఆయల పనులను పరిశీలించారు. మేయర్​తో పాటు స్థానిక తెరాస నాయకులు ఉన్నారు.

మేయర్​కు లడ్డూ ప్రసాదం అందిస్తున్న ఆలయ ఏఈవో

ఇదీ చూడండి: Bonalu Festival :బోనాల పండుగ ఉత్సాహం.. నిబంధనల మధ్యే దర్శనం

ABOUT THE AUTHOR

...view details