తెలంగాణ

telangana

ETV Bharat / state

నారసింహుని సన్నిధిలో భక్తుల కిటకిట - యాదాద్రి భువనగిరి లేటెస్ట్ న్యూస్

నారసింహుని సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తిక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణ వ్రత మండపం కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది.

devotees crowd at lakshmi narasimha swamy temple in yadadri bhuvanagiri
నారసింహుని సన్నిధిలో భక్తుల కిటకిట

By

Published : Dec 13, 2020, 3:30 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం పైగా ఆదివారం కావడంతో సందడి నెలకొంది. స్వామివారి దర్శన సమయానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. లఘు దర్శన సౌకర్యాన్నీ ఆలయ అధికారులు కల్పిస్తున్నారు. సత్యనారాయణ వ్రత మండపం కిటకిటలాడుతోంది. భక్తులు కుటుంబ సమేతంగా వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.

నారసింహుని సన్నిధిలో భక్తుల కిటకిట

భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణ మండపం, దర్శన క్యూ లైన్లు, కల్యాణ కట్ట, వసతి గృహాల సముదాయం వద్ద రద్దీ నెలకొంది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్​ని నియంత్రించారు.

ఇదీ చదవండి:వెండితెరపై ప్రపంచ ఛాంపియన్​ ఆనంద్​ బయోపిక్​

ABOUT THE AUTHOR

...view details