తెలంగాణ

telangana

యాదాద్రి నరసింహ స్వామి సేవలో సీఎస్​

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు.

By

Published : Jan 5, 2020, 2:48 PM IST

Published : Jan 5, 2020, 2:48 PM IST

cs somesh kumar visited yadadri temple
యాదాద్రి నరసింహ స్వామి సేవలో సీఎస్​

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ సోమేశ్​ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎస్​కు ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు.

దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్​ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొండ పైగల హరిత టూరిజంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఆలయానికి వచ్చిన సోమేశ్​కుమార్​కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. సోమేశ్​కుమార్​ వెంట ఆలయ ఈవో గీతారెడ్డి, జిల్లా కలెక్టర్​ అనిత రామచంద్రన్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్​రావు, పలువురు యాడ అధికారులు ఉన్నారు.

యాదాద్రి నరసింహ స్వామి సేవలో సీఎస్​

ఇవీ చూడండి: 'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'

ABOUT THE AUTHOR

...view details