యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో 50 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాకేంద్ర ఆసుపత్రిలో 20 పడకలతో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించగా తాజాగా మరో 50 పడకలతో ఐసోలేషన్ను ప్రారంభించారు.
50 పడకలతో కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం - covid isolation centre started at aims in bibinagar
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో 50 పడకలతో కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డి ప్రారంభించారు. ఇంటి వద్ద హోం ఐసోలేషన్లో ఉండేందుకు సదుపాయం లేని కరోనా రోగులకు ఇక్కడ చికిత్స పొందవచ్చని ఎమ్మెల్యే వెల్లడించారు.
![50 పడకలతో కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం మదనగ్ గేదతోూగదల మాలూీా ైగూప 50 వా్ే ేూీూా్ ోూ వగవగలోుోీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8442628-1027-8442628-1597589124626.jpg)
50 పడకలతో కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం
ఇప్పటివరకు జిల్లాలో 70 పడకలతో కరోనా రోగులకు చికిత్స అందనుంది. ఇంటి వద్ద హోం ఐసోలేషన్లో ఉండేందుకు సదుపాయం లేని కరోనా రోగులకు ఎయిమ్స్, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రంలో కొవిడ్-19 చికిత్స అందించనున్నారు.