తెలంగాణ

telangana

By

Published : May 11, 2021, 3:17 PM IST

ETV Bharat / state

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు జరిపిన కౌన్సిలర్

కరోనాతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహానికి స్థానిక కౌన్సిలర్​ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో జరిగింది.

covid death
covid death

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో కరోనాతో చనిపోయిన ఓ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఓ కౌన్సిలర్​​. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆపత్కాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

9వ వార్డులో చిక్క రాధమ్మ (53) కరోనా బారినపడి గత రాత్రి కన్నుముశారు. వైరస్​ భయంతో స్థానికులెవరూ ముందుకు రాకపోవడంతో.. కౌన్సిలర్​ అనిల్​ అంత్యక్రియలు జరిపించారు. పీపీఈ కిట్ ధరించి జేసీబీ సాయంతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

ఇదీ చదవండి:రుయా ఆసుపత్రి వార్డుల ఎదుట మృతుల బంధువుల ఆర్తనాదాలు

ABOUT THE AUTHOR

...view details