తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో బాలింత మృతి - యాదాద్రిలో కరోనాతో బాలింత మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలింతకు పాజిటివ్​ నిర్ధరణ కాగా ఆమె ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

corona update in yadadri bhuvanagirigi a pregnant died with corona
కరోనాతో బాలింత మృతి

By

Published : Jun 2, 2020, 5:19 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలింతకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం హైదరాబాద్​లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. దీనితో అప్రమత్తమైన అధికారులు ఆ మహిళ ఇంటి సమీప పరిసరాలను, కాలనీలను కంటోన్మెంట్ ఏరియాగా ప్రకటించి.. పారిశుద్ధ్య పనులు చేపట్టి శానిటైజ్ చేశారు.

ప్రజలెవరూ ఆ ప్రాంతం గుండా రాకపోకలు చేయకుండా కర్ఫ్యూ విధించారు.. అలాగే కోవిడ్​గా నిర్ధరణ అయిన మహిళ ప్రైమరీ కాంటాక్ట్స్​ను సుమారు 13 మందిని, మరికొంతమందిని గుర్తించి హోమ్ క్వారంటైన్​ విధించారు.

ఇవీ చూడండి:బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details