యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఆదివారం నాడు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి మాత్రమే పాజిటివ్ అని తేలినట్లు వైద్యాధికారి చైతన్య కుమార్ తెలిపారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదు కావడం వల్ల ఆందోళన చెందిన మోత్కూరు మండల పరిధిలోని ప్రజలు కేసులు తక్కువగా నమోదయ్యాయని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్గా తేలిన ముగ్గురికి ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్న వారిని గుర్తించి వారికి కూడా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.
మోత్కూరులో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు! - మోత్కూరులో తగ్గిన కరోనా కేసులు
గత కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలక పరిధిలో ఆదివారం కరోనా కేసుల తీవ్రత తగ్గింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్ అని తేలింది. వీరికి ప్రైమరీ కాంటాక్ట్లుగా ఉన్న వారిని గుర్తించి వారికి కూడా పరీక్షలు చేయనున్నట్టు వైద్యాధికారి చైతన్య కుమార్ తెలిపారు.

వైరస్ సోకిన వచ్చిన వారికి మెడికల్ కిట్స్ అందజేసి.. హోం క్వారంటైన్లో ఉంచినట్లు వైద్యులు చెప్పారు. మండలంలో ఇప్పటి వరకు 1033 పరీక్షలు నిర్వహించగా196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఇందులో 20 మంది పూర్తిగా కోలుకున్నారని వైద్యాధికారులు పేర్కొన్నారు. కాగా మోత్కూరు పురపాలక కేంద్రంలో వ్యాపారస్తులు గత ఆరు రోజులుగా స్వతహాగా లాక్డౌన్ పాటిస్తూ.. వ్యాపార సముదాయాలు మూసేయడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు