లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని రాచకొండ కమిషనర్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో కళాకారులతో విచిత్ర వేషధారణతో వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పించారు.
కళాకారులతో కరోనాపై అవగాహన - awareness on corona in bhuvanagiri
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్లో రాచకొండ పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కళాకారులతో వీధుల్లో తిరుగుతూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
![కళాకారులతో కరోనాపై అవగాహన corona awareness in yadadri bhuvanagiri district by artists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7151036-793-7151036-1589185624667.jpg)
కళాకారులతో కరోనాపై అవగాహన
కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పోలీసులు సూచించారు. బయటకు వెళ్లిన వారు తప్పకుండా మాస్కు ధరించాలని కోరారు.