తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 11:02 AM IST

ETV Bharat / state

వైరస్​ను జయించిన కానిస్టేబుల్​.. అభినందించిన కమిషనర్

కరోనా వైరస్​ను జయించి విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఓ కానిస్టేబుల్​ను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ అభినందించారు. అతనికి సన్మానం చేసి విధుల్లోకి ఆహ్వానించారు.

Constable conquered the virus in yadadri district
వైరస్​ను జయించిన కానిస్టేబుల్​.. అభినందించిన సీపీ

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వర్తించే మౌలానా అనే ఓ కానిస్టేబుల్.. ఇటీవల కొవిడ్​ బారినపడ్డారు. హైదరాబాద్​ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తాజాగా వైరస్​ను జయించి.. విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా హైదరాబాద్​లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయం వద్ద మౌలానాను సీపీ మహేశ్​ భగవత్ అభినందించారు. సన్మానించి విధుల్లోకి ఆహ్వానించారు.

ఇదీచూడండి: 800 మంది పోలీసులకు కరోనా.. కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఎక్కువ

ABOUT THE AUTHOR

...view details