తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ఎదుట వైద్య సిబ్బంది ఆందోళన - కొవిడ్ సంక్షోభంలో వైద్య సిబ్బంది

యాదాద్రి భువనగిరి కలెక్టరేట్​ ఎదుట జిల్లాలోని వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మెడికల్​ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ అనితా రామచంద్రన్​కు వినతిపత్రం అందజేశారు. వైద్య సిబ్బంది కుటుంబాలకు వెంటనే వ్యాక్సినేషన్ వేయాలని కోరారు.

health department employees problems
health department employees problems

By

Published : Jun 8, 2021, 7:10 PM IST

కొవిడ్​ మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా.. కనీసం తమకు ఇన్సెంటివ్స్​ కూడా ఇవ్వడం లేదని యాదాద్రి జిల్లాలోని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెడికల్​ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ అనితా రామచంద్రన్​కు వినతిపత్రం అందజేశారు. వైద్య సిబ్బంది కుటుంబాలకు వెంటనే వ్యాక్సినేషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా బారిన పడ్డ వైద్య సిబ్బందికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కనీసం 10 శాతం ఆక్సిజన్​ పడకలను ప్రత్యేకంగా కేటాయించాలని వారు కోరారు. సిబ్బందికి.. కేంద్రం ప్రకటించిన రూ. 50 లక్షల ప్రమాద బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఫిక్స్​డ్ వేతనం ఇవ్వాలని కోరారు. వైద్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్​ వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:Bandi sanjay: తెలంగాణకు జూన్​, జులైలో 20లక్షల చొప్పున వ్యాక్సిన్లు

ABOUT THE AUTHOR

...view details