తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Yadadri Visit: సీఎం యాదాద్రి పర్యటన... బాలాలయంలో దర్శనం - Cm kcr on yadadri works

జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన ఆయా జిల్లాల కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలను ప్రారంభించారు. ఇవాళ ఉదయం వరంగల్​ జిల్లాలో సీఎం పర్యటించారు. అనంతరం యాదాద్రి (Yadadri)లో పర్యటిస్తున్నారు.

CM kcr visited Yadadri
సీఎం యాదాద్రి పర్యటన

By

Published : Jun 21, 2021, 7:45 PM IST

Updated : Jun 21, 2021, 8:49 PM IST

సీఎం యాదాద్రి పర్యటన...

వరంగల్​ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) యాదాద్రి (Yadadri) క్షేత్రాన్ని సందర్శించారు. వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 6:18 నిమిషాలకు ఆలయ నగరికి చేరుకున్న ఆయన... తొలుత గండిచెరువు ప్రాంగణం వద్ద వలయ రహదారిలో నిర్మాణాలు పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీనృసింహ స్వామివార్లను... దర్శించుకున్నారు.

బాలాలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఆయన సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్​రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, జోగినపల్లి సంతోశ్ కుమార్, గొంగిడి సునీత ఉన్నారు.

బాధితులతో ముచ్చట...

యాదాద్రి క్షేత్ర సందర్శనలో ముఖ్యమంత్రి కేసీఆర్... వైకుంఠ ద్వారం వద్ద ఆగి రహదారి విస్తరణ బాధితులతో ముచ్చటించారు. 20 నిమిషాల పాటు మాట్లాడిన సీఎం... బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి వెంట గల భవనాలు, ఇళ్ల కూల్చివేతల్ని పరిశీలించారు. గిరి ప్రదక్షిణ దారిలోని నక్షత్ర వనం ప్రాంతంలో నిర్మితమవుతోన్న... పై వంతెన పనుల్ని పరిశీలించారు. అనంతరం కొండపైకి చేరుకున్నారు. కల్యాణకట్ట, పుష్కరిణి, దీక్షాపరుల మండపం తదితర కట్టడాల గురించి వివరాలు తెలుసుకున్నారు. కొండ చుట్టూ గల వలయ రహదారిని... సాంతం వీక్షించారు.

రేపు వాసాలమర్రికి...

యాదాద్రి (Yadadri) పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ (Cm Kcr) రేపు ఇదే జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఇందుకు గాను సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్... వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత, కలెక్టర్ పమేలా సత్పతితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

సభాస్థలి, భోజనశాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభ విజయవంతానికి పూర్తిస్థాయిలో కార్యాచరణ ఉండేందుకు గాను... సమీక్ష నిర్వహించారు. గ్రామసభలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు... ఇతర గ్రామాల వారు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. సీఎం గ్రామ పర్యటనకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో... వాసాలమర్రిలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సహపంక్తి భోజనాలు ఒకచోట, సభ మరోచోట నిర్వహించేలా పనులు సాగుతున్నాయి. ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు అధికారులు పాసులు అందజేస్తున్నారు.

ఇదీ చూడండి:KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది

Last Updated : Jun 21, 2021, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details