మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన కారు
చౌటుప్పల్ మండంలో కారు అదుపు తప్పి మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో మగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన కారు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుడిమల్కాపురంలో మారుతి కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : May 25, 2019, 3:02 PM IST