తెలంగాణ

telangana

యాదాద్రిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. పదో రోజూ వైభవంగా సాగాయి. రాత్రి జరిగిన దేవతోద్వాసన అనంతరం.. విడిది చేసిన సకల దేవతలు క్షేత్రం నుంచి తమ తమ లోకాలకు తిరుగు పయనమయ్యారు. ఈ పర్వాలకు బాలాలయం వేదికైంది.

By

Published : Mar 25, 2021, 9:12 AM IST

Published : Mar 25, 2021, 9:12 AM IST

Brahmotsavalu in yadadri sri lakshmi narasimha temple
యాదాద్రిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజు స్వామి వారికి.. గంగాళంలో చక్రస్నానం, దేవతోద్వాసన పర్వాలను నిర్వహించారు.

కల్యాణ దంపతులకు ప్రత్యేక పూజలు

కల్యాణ దంపతులైన శ్రీ లక్ష్మీనారసింహులకు అనేక రకాల పుష్పాలతో వేదమంత్రోచ్చారణల నడుమ యాగాన్ని చేపట్టారు. గురువారం వేడుకలు ముగుస్తున్నందున్న.. అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించేందుకు సంప్రదాయ ఏర్పాట్లు చేశారు.

యాగశాలలో మహాపూర్ణాహుతి

ఈ వేడుకల్లో.. ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, పేష్కార్‌ రమేశ్‌బాబు, ఏఈవోలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవ సేవలో వేద పారాయణికులు

ఇదీ చదవండి:కళారూపానికి కాదేదీ అనర్హం!

ABOUT THE AUTHOR

...view details