తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2022, 7:33 AM IST

ETV Bharat / state

మునుగోడులో దూకుడు పెంచిన భాజపా.. రంగంలోకి సీనియర్ నేతలు

BJP Campaigned Munugode bypoll: మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాజపా దూసుకుపోతోంది. కమలం పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. రాజగోపాల్‌కు మద్దతుగా బండి సంజయ్‌, కిషన్‌రె‌డ్డి ప్రచారం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో భాజపాను గెలిపించాలంటూ నేతలు తీరిక లేకుండా శ్రమిస్తున్నారు.

BJP leaders in the munugode by election
BJP leaders in the munugode by election

మునుగోడులో దూకుడు పెంచిన భాజపా.. రంగంలోకి సీనియర్ నేతలు

BJP Campaigned Munugode bypoll: మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో భాజపా నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చండూరులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటించారు. నియోజకవర్గ ఓటర్లను కలుసుకున్న ఆయన.. పేదోడు చచ్చిపోతే.. పెద్దోడు రాజ్యమేలుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతుందన్న బండి సంజయ్‌.. కేసీఆర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

తెరాస సర్కార్‌ మునుగోడును నిర్లక్ష్యం చేసిందని రాజగోపాల్‌ రాజీనామాతో నేతలంతా గ్రామాలకు వస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. అభివృద్ధి కోసం రాజీనామా చేసిన రాజగోపాల్‌ను.. తిరిగి గెలిపించుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు. ఉపఎన్నికలో రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలంటూ మునుగోడు మండలం సింగారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేశారు.

ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్న ఆయన కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. మునుగోడు ఉపఎన్నిక న్యాయానికి-అన్యాయానికి, ధర్మానికి-అధర్మానికి మధ్య జరుగుతోందని కిషన్​రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా చిన్నకొండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రోడ్‌షో ద్వారా ఓటర్లను కలుసుకున్నారు. కుంట్లగూడెంలో రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా విజయశాంతి ప్రచారం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details