తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యమకారుల సైకిల్ యాత్ర

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తమపై నమోదైన కేసులు ఇంకా కొట్టివేయకపోవడంపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు.     ఇందుకు నిరసగా ఈరోజు సైకిల్ యాత్ర నిర్వహించారు.

By

Published : Sep 17, 2019, 10:41 PM IST

ఉద్యమకారుల సైకిల్ యాత్ర


తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు ఇంకా కొట్టివేయకపోవడంపై ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కు చెందిన పెద్దగోని రమేశ్​గౌడ్, గుంటోజు ఆంజనేయచారి, షేక్ మున్నాలపై 2012లో కేసులు పెట్టారు. ఏడేళ్లుగా రామన్నపేట కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇందుకు నిరసనగా ఈ రోజు చౌటుప్పల్ నుంచి రామన్నపేట కోర్టు వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకి చౌటుప్పల్, పంతంగి, గుండ్రంపల్లి, రామన్నపేటలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యమకారులు సంఘీభావం తెలిపారు.

ఉద్యమకారుల సైకిల్ యాత్ర

ABOUT THE AUTHOR

...view details