తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు ప్రారంభం

యాదాద్రి ఆలయంలో రేపటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. నియమిత సంఖ్యలో భక్తులకు అవకాశం కలిపించనున్నారు.

By

Published : Oct 3, 2020, 10:07 PM IST

Updated : Oct 4, 2020, 4:01 AM IST

arjitha sevalu will start in Yadadri from tomorrow
నేటి నుంచి యాదాద్రిలో ఆర్జిత సేవలు ప్రారంభం

యాదాద్రి ఆలయంలో నేటి నుంచి ఆర్జిత సేవలు కొవిడ్​ 19 నిబంధనలను పాటిస్తూ.. కొనసాగించనున్నారు. నియమిత సంఖ్యలో భక్తులకు అవకాశం కలిపించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో కరోనా కారణంగా రద్దు అయిన ఆర్జిత సేవలు, సుదర్శన హోమం, నిత్య కల్యాణం, అభిషేకం అర్చనలు నేటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి.

స్వామివారి నిత్య కల్యాణోత్సవం 25 టికెట్లు 50 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. సుదర్శన నారసింహ హోమం 25 టికెట్లు 50 మందికి మాత్రమే ప్రవేశం ఉండగా.. స్వామి వారి అభిషేకం, అర్చనకు 25 టికెట్లు మాత్రమే 50 మందికి ప్రవేశం కల్పించనున్నారు.

Last Updated : Oct 4, 2020, 4:01 AM IST

ABOUT THE AUTHOR

...view details