యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రుస్తాపూర్ అంగన్వాడి కేంద్రంలో కాంట్రాక్టర్ నాసిరకమైన, పాడైపోయిన పాలు, నూనెలను సరఫరా చేశాడు. పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తున్నారని అంగన్వాడి కేంద్రం ముందు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పోషకాహారం అందించాల్సిన అంగన్వాడి కేంద్రం అనారోగ్యానికి మారుపేరుగా మారిందని ఆరోపించారు.
అనారోగ్యానికి మారుపేరుగా అంగన్వాడి కేంద్రం
నాణ్యమైన పోషకాహారాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రంలో పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలపై నిఘా కొరవడింది. నాసిరకమైన పాలు, నూనెలను అందిస్తూ.. చిన్న పిల్లల, గర్భిణీ, బాలింతల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
అనారోగ్యానికి మారుపేరుగా అంగన్వాడీ కేంద్రం