యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గంధమల్ల జలాశయం నిర్మాణాన్ని రద్దు చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. రైతుబంధు రాని రైతులు ఈ నెల 13 లోపు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం నకలు పత్రాలతో ఏఈఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు: ప్రభుత్వ విప్ - ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
ఆలేరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. గంధమల్ల జలాశయం నిర్మాణాన్ని రద్దు చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని ఆమె తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
![ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు: ప్రభుత్వ విప్ Alleru MLA gongidi Sunitha Attend Atmakur(M) Mandal general Meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7577398-265-7577398-1591888213427.jpg)
ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు: ఎమ్మెల్యే
కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను గోదావరి జలాలలో నింపుతామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.