తెలంగాణ

telangana

శ్రీరామావతారంలో ఊరేగిన యాదాద్రీశుడు

వేదపారాయణాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాద్యాల మధ్య యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు శ్రీరామవతారంలో బాలాలయంలో ఊరేగారు.

By

Published : May 6, 2020, 1:38 PM IST

Published : May 6, 2020, 1:38 PM IST

2nd day of yadadri narasimha swamy birthday celebrations  held in a grand way
శ్రీరామావతారంలో ఊరేగిన యాదాద్రీశుడు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా జరిగాయి. లాక్​డౌన్ కారణంగా భక్తులు లేకుండానే ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో రెండో రోజు రాత్రి నృసింహ మూల మంత్ర జపాలు నిర్వహించారు.

అనంతరం హనుమంత వాహనంపై శ్రీరామావతార అలంకారంలో బాలాలయంలో ఊరేగుతూ కనువిందు చేశారు. యాదాద్రి నరసింహుని.. జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన ఈ రోజు.. సహస్ర కళశాభిషేకంతో పరిసమాప్తి పలకనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

శ్రీరామావతారంలో యాదాద్రీశుడు

ఇదీ చూడండి:భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

ABOUT THE AUTHOR

...view details