Yadadri Hundi Income: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీని లెక్కించారు. 28 రోజుల హుండీ ఆదాయంకోటి 43 లక్షల 29వేల 820 రూపాయాల నగదు రాగా.. 134 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 850 గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
yadadri temple news: మరోవైపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు విరాళాల సేకరణ కొనసాగుతోంది. భక్తజనుల నుంచి విరాళాల సేకరణకు సెప్టెంబరు 25న దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 2,360 గ్రాముల బంగారం, నగదు రూ.9,63,26,656 భక్తుల ద్వారా సమకూరినట్లు ఈవో గీత తెలిపారు. 45 అడుగుల ఎత్తున్న దివ్య విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు 65 కిలోల బంగారం అవసరమని యాడా యంత్రాంగం భావించింది. ఆ మేరకు ముఖ్యమంత్రి గత పర్యటనలో భక్తులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.