తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో అకున్​సబర్వాల్​ ఆకస్మిక తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో పౌరసరఫరాల కమిషనర్​ అకున్ సబర్వాల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. త్వరితగితిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

By

Published : May 19, 2019, 7:32 PM IST

యాదాద్రి జిల్లాలో అకున్​సబర్వాల్​ ఆకస్మిక తనిఖీలు

పౌరసరఫరాల కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో తనిఖీలు చేపట్టారు. పోచంపల్లి మండలంలోని ఇంద్రియాల, పెద్దరావులపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందుకు కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కనీస వసతుల కల్పనపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బస్తాలు, తూకం యంత్రాలు తదితర పరికరాలను పరీక్షించారు. 10 రోజుల్లో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని అకున్‌ సబర్వాల్‌ స్పష్టం చేశారు.

యాదాద్రి జిల్లాలో అకున్​సబర్వాల్​ ఆకస్మిక తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details