young lady killed a man in mulugu: సహనానికి కూడా హద్దు ఉంటుంది. పరిధి దాటితే చీమైనా సింహంలా విజృంభించొచ్చు. అందుకే ఏదైనా అతి పనికి రాదని పెద్దలు చెబుతుంటారు. అలా ఓ యువకుడు ఆమెతో అతిగా ప్రవర్తించాడు. ఆ తర్వాత లైంగిక వాంఛ తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఇదంతా మామూలేనని భావించిన యువతి సైలెంట్గా ఉంది. కానీ పోనుపోను వేధింపులు ఎక్కువ అవ్వడంతో సహనం కోల్పోయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతడి తీరులో మార్పు రాకపోవడంతో విసిగిపోయి ఏకంగా అతణ్ని హతమార్చింది. ఈ ఘటన ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో చోటుచేసుకుంది.
young lady killed a man in mulugu for harassing : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్న యువకుడిని హతమార్చింది ఓ యువతి. రోజురోజుకు అతడి వేధింపులు తాళలేక.. ఎలాగైనా ఆ బాధ నుంచి బయటపడాలని చివరకు చంపేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. అసలేం జరిగిందంటే..?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని మూడో వార్డులో రామటెంకి శ్రీనివాస్(25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఏ పనిపాటా లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. పెళ్లి చేస్తే అయినా మారతాడేమోనని భావించి అతడి తల్లిదండ్రులు రెండేళ్ల క్రియం ఓ యువతితో వివాహం జరిపించారు. పెళ్లయినా అతడి తీరు మారకపోగా.. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. అతడి టార్చర్ భరించలేక ఆ మహిళ శ్రీనివాస్ను వదిలి వెళ్లిపోయింది.