తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. హన్మకొండలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మాతాశిశు విగ్రహాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి ఆవిష్కరించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం: చీఫ్ విప్ వినయభాస్కర్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. హన్మకొండలోని ప్రసూతి ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన మాతాశిశు విగ్రహాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి ఆవిష్కరించారు.
![ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం: చీఫ్ విప్ వినయభాస్కర్ Maatha shishu statue Inaugaurated by chief vip vinaya bhaskar in hanmakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9087715-474-9087715-1602078513312.jpg)
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం: చీఫ్ విప్ వినయభాస్కర్
మహిళలకు సరైన గౌరవం దక్కాలన్న ఆశయంతోనే విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రసూతి ఆసుపత్రికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు.