తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2020, 7:03 PM IST

ETV Bharat / state

అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం

వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ మహిళ మృతదేహాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఆసుపత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు ఆమె మృతదేహం వర్షంలో తడుస్తూ ఉంది. వర్షం తగ్గితే గానీ మార్చురీకి తరలించలేదు ఆసుపత్రి సిబ్బంది.

అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం
అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో... ఆసుపత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు మృతదేహాన్ని వర్షంలోనే వదిలేశారు. సుమారు రెండు గంటల సేపు క్యాజువాలిటీ ముందే ఉండిపోయింది.

హన్మకొండకు చెందిన ఓ మహిళ శ్వాస సంబంధిత సమస్యతో ఎంజీఎంకు వచ్చింది. చికిత్స అందించే లోపే.. కన్నుమూసింది. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఆ మహిళ కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లకుండా... క్యాజువాలిటీ ముందు వర్షంలోనే వదిలేశారు. ఆ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది సైతం పట్టించుకోలేదు. వర్షం తగ్గిన తర్వాత సిబ్బంది ఎంజీఎం మార్చురీకి తరలించారు.

ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details