వర్షాల్లేక చెరువులు వెలవెల... ఆందోళనలో రైతన్నలు
summary: వర్షాకాలంలోనూ భానుడి ప్రతాపం మాత్రం తగ్గడం లేదు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
వర్షాకాలం ప్రారంభమై ఒకటిన్నర నెల గడిచిపోతున్న ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు. దీనికితోడు పగటి వేళల్లో భానుడి భగభగలకు వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లో ప్రధాన చెరువుల పరిస్థితి కరువును తలపించేలా తయారైంది. చెరువు నీటిపై ఆధారపడే రైతులు ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభించలేదు. మరో నెల రోజుల పాటు ఇలాగే కొనసాగితే సాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.