తెలంగాణ

telangana

By

Published : Sep 1, 2019, 8:54 PM IST

ETV Bharat / state

మోదీతో చంద్రయాన్​ను వీక్షించనున్న వరంగల్ విద్యార్థి

ఇస్రో ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో  నిర్వహించిన ఆన్​లైన్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పార్థివ్​కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో చంద్రయాన్​ -2 లాండింగ్​ను ప్రత్యక్షంగా ​చూసేందుకు ఇస్రో నుంచి ఆహ్వానం లభించింది.

మోదీతో చంద్రయాన్​ను వీక్షించనున్న వరంగల్ విద్యార్థి

హన్మకొండలోని తేజస్వీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పార్థివ్​ ఈ నెల 7వ తేదీన చంద్రయాన్-2 వీక్షించేందుకు ఇస్రో బెంగళూర్ నుంచి ఆగస్టు 30న ఆహ్వానం అందుకున్నాడు. తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా అందులో పార్థివ్​ ఒకరు. తమ పాఠశాల నుంచి ఎంపిక కావటం ఎంతో గర్వకారణమని పార్థివ్​నుయాజమాన్యంఅభినందించింది. అతనితో పాటుగా తల్లికి కూడా చంద్రయాన్-2 చూసే అవకాశం దక్కింది.

మోదీతో చంద్రయాన్​ను వీక్షించనున్న వరంగల్ విద్యార్థి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details