తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణికి తరలొచ్చిన ప్రజలు

వరంగల్‌ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పలు సమస్యలను కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ అక్కడిక్కడే పరిష్కరించారు.

By

Published : Aug 5, 2019, 5:02 PM IST

ప్రజావాణికి తరలొచ్చిన ప్రజలు

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్​లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలను విన్నవించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఎక్కువగా భూసమస్యలు, పింఛన్లు, సదరన్ సర్టిఫికెట్ల బాధితులు తమ సమస్యలను పరిష్కరించమంటూ కలెక్టర్‌కు విన్నవించారు.

ప్రజావాణికి తరలొచ్చిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details