తెలంగాణ

telangana

By

Published : Mar 8, 2021, 3:51 PM IST

ETV Bharat / state

తెరాస ప్రచారాన్ని అడ్డుకున్న విద్యార్థులు

కాకతీయ విశ్వవిద్యాలయంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని నిరసిస్తూ.. విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

warangal Kakatiya University. Protesting against this election campaign of trs
తెరాస ప్రచారాన్ని అడ్డుకున్న విద్యార్థులు

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారాన్ని నిరసిస్తూ.. విద్యార్థులు ఆందోళన చేశారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ రాగా.. అతని వాహనాన్ని విద్యార్థులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:విమెన్స్ డే ప్రత్యేకం: ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!

ABOUT THE AUTHOR

...view details