వరంగల్ నగర సుందరీకరణలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రొఫెసర్ జయశంకర్ పార్క్, సరిగమపదనిస వనం, వడ్డేపల్లి, భద్రకాళి బండ్ సుందరికరణ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.
కుడా ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ పార్క్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న రాక్ క్లైబింగ్, కలరింగ్ సుందరీకరణ తక్షణమే పూర్తి కావాలని అధికారులను అదేశించారు. పద్మాక్షి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సరిగమపదనిస ఉద్యానవనంలో శిల్ప నిర్మాణంపై ఆరా తీశారు.