తెలంగాణ

telangana

సమస్యలు పరిష్కరించే వరకు  సమ్మెను ఆపేది లేదు

By

Published : Oct 24, 2019, 3:13 PM IST

ఓరుగల్లులో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. మహిళా కండక్టర్లు నిరహార దీక్షలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేదిలేదని హెచ్చరించారు.

సమస్యలు పరిష్కరించే వరకు  సమ్మెను ఆపేది లేదు

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 20 రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. సమ్మెలో భాగంగా హన్మకొండలోని లోకల్​డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కండక్టర్లు నిరహార దీక్షలు చేపట్టారు. రోజుకు ఒక తీరుతో నిరసన తెలుపుతూ తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదు

ABOUT THE AUTHOR

...view details