ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె - tsrtc_strike_continues_at_warangal_urban
తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వరంగల్ అర్బన్లో కార్మికులు సమ్మెను ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు.
![ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4755221-1033-4755221-1571112948390.jpg)
ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. డిపో వద్ద అవాఛనీయ ఘటనలు జరగకుండా బస్టాండ్లో పోలీసులు మోహరించారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె